పరిపాలనాధికారిగా అప్పల స్వామి బాధ్యతలు స్వీకరణ
పాడేరు ఆగస్టు 25 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారిగా కొమ్ము అప్పల స్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తాహశీల్దారుగా విధులు నిర్వస్తున్న అప్పల స్వామి పరిపాలనాధికారిగా పదోన్నతి పొందారు. ఆయనకు సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, పలువురు తాహశీల్దారులు పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు.
0 Comments