గూడెం కొత్తవీధి సెప్టెంబర్ 2 (రిపోర్టర్ రామకృష్ణ)
గూడెం కొత్తవీధి, మండలం సీలేరు గణపతి సెంటర్లో శనివారం వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని పందిరి ముహుర్తపు రాట కార్యక్రమంను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతీ ఏటా స్థానిక గణపతి సెంటర్లో గణపతి రాత్రి మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూంటారు. ఈ నేపద్యంలోనే ఈ ఏడాది కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు నక్కా జ్ఞానేశ్వరావు (బాల), బొర్రా కృష్ణ, చదరం సత్తిబాబు, దేశాబత్తుల చక్కరరావు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బాలాజీ, నాగమణి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొనగా, ముత్తైదువులు చేతుల మీదుగా ముహుర్తపు రాటను వేసారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఈఈ ప్రభాకరరావు, సర్పంచ్ దుర్గ కాంగ్రెస్ నాయకులు కారే శ్రీనివాస్, వానపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments