చింతపల్లి, సెప్టెంబర్ 4:మండలంలోని కొత్తపాలెం పంచాయతీ డేగలపాలెం గ్రామంలో వృద్ధురాలైన వంతల జట్లోకి పింఛన్ సొమ్ము అందింది. వివరాల్లోకి వెళితే, జట్లోకి 2006 నుంచి పింఛన్ వస్తుంది. ఆమె వేలిముద్రలు నమోదు కాకపోవడం వల్ల కుమారుడు కృష్ణారావు వేలిముద్రలను గ్రామ సచివాలయం అధికారులు పింఛన్ పంపిణీకి రిజిస్ట్రేషన్ చేశారు. ప్రతినెల కృష్ణారావు వేలిముద్రం తీసుకొని గ్రామ వలంటీర్ అతనికి పింఛన్ నగదును అందజేస్తున్నాడు. అయితే పింఛన్ సొమ్ము కృష్ణారావు తీసుకోవడం వల్ల జట్లోకి పింఛన్ నిలిచిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే సోమవారం గ్రామంలో ఎంపీడీవో ఆదేశాల మేరకు సర్పంచ్ వనగల సోమరత్నం, కార్యదర్శి రాజేష్ విచారణ చేపట్టి సెప్టెంబర్ నెల పింఛన్ ని జట్లోకి అందజేశారు. ప్రతి నెల పింఛన్ నగదు జట్లోకి అందజేసి ఫోటో పంపించాలని ఎంపీడీవో వలంటరీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు బెన్నీబాబు పాల్గొన్నారు.
0 Comments