పాడేరు(వి.డేవిడ్) : ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపుమేరకుమంగళవారం పాడేరు లో మాజీ ఎమ్మెల్యే, పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి అధ్యర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ యువనాయకులు
కోడా వెంకట సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ"5, డీజీల్ పై రూ" 10 సెస్ తగ్గించింది.ఇందులో భాగంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్రోలు,డీజీల్ రేట్లు తగ్గించి అమ్మకాలు జరుపుతున్నప్పటికి కేవలం ఆంధ్రరాష్ట్రంలో మాత్రం ఒక్క రుపైకూడా తగ్గించకుండా అమ్మకాలు జరపడం అన్యాయమని ఆయన అన్నారు,కాబట్టి రేపు జరగబోయే నిరసన కార్యక్రమానికి నాయకులు,కార్యకర్తలు అందరూ పాల్గోని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
0 Comments