గూడెంకొత్తవీధి, మర్చి 27:
మండలానికి చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టన్ దుమంతి వీరవెంకట సత్యనారాయణ ఉచితంగా గిరిజనులకు మాస్క్ లను పంపిణీచేశారు. ఆదివాసీలు మాస్క్ లు అందుబాటులో లేవు, అలాగే ఆదివాసీలు మాస్క్ లు కొనుక్కోలేని పరిస్థితిని ఎదుర్కొటున్నారు. దీంతో కొంతకాలంగా వ్యక్తి గత నిధులతో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న ఆర్ ఐ సత్యనారాయణ సొంత నిధులతో మంచి క్లాత్ తో ఐదువేల పలు గ్రామా గిరిజనులకు మాస్క్ లు కుట్టించి గిరిజనులకు పంపిణి చేసారు. దీనితో స్థానిక గిరిజనులు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకుడు రీమాల పాల్ , గ్రామపెద్దలు పాల్గొన్నారు .
0 Comments