
హైదరాబాద్ మార్చి 28 : రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కుత్బుల్లాపూర్కు చెందిన వ్యక్తి కరోనా లక్షణాలతో 74 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని తెలిపారు. ప్రస్తుతం వృద్ధుడి భార్య, కుమారుడిని హోం క్వారంటైన్లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 65కు చేరిందని ఈటల తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘కుత్బుల్లాపూర్కు చెందిన వ్యక్తి ఈ నెల 14న మతపరమైన కార్యక్రమం కోసం వృద్ధుడు దిల్లీ వెళ్లారు. 17న నగరానికి తిరిగి వచ్చారు. మార్చి 20న వృద్ధుడికి తీవ్ర జ్వరం రావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది. వృద్ధుడికి సైఫాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి మరణించాడు. వెంటనే సమీప కార్పొరేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో సైఫాబాద్ పోలీసుల సాయంతో మృతదేహాన్ని గాంధీకి తరలించారు. అక్కడి వైద్యులు వృద్ధుడి నమూనాలను పరీక్షలకు పంపినప్పుడు అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది’’ అని ఈటల చెప్పారు. ఆస్పత్రుల్లో చనిపోయిన వారి వివరాలను ఇవ్వాలని ఆస్పత్రులను కోరామన్నారు.
కొత్తగా ఆరు కేసులు
0 Comments