ఏపీలో ఉద్యోగుల జీతాల్లో కోత


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ప్రజాప్రతినిధుల జీతాల్లో వందశాతం కోత విధిస్తున్నట్లు పేర్కొంది. ఆలిండియా సర్వీస్‌ అధికారుల వేతనాల్లో 60 శాతం, ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధించింది. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం  ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేయనుంది. కాగా కోత విధించిన జీతాన్ని సంక్షోభం నుంచి బయటపడ్డాక చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Post a Comment

0 Comments