అరకు పట్టణ వీధుల్లో శాసనసభ్యులు శెట్టి ఫాల్గుణ కరోనా వైరస్ వ్యాప్తి నివారణ పై ప్లకార్డు ప్రదర్శిస్తూ కాలినడకన విస్తృత ప్రచారం నిర్వహించారు. బుధవారం ఉదయం అరకు వ్యాలీ చేరుకున్న ఆయన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కరోనా వైరస్ పై స్థానికులకు అవగాహన కల్పించారు. ఎదురుగా విధులు నిర్వహిస్తూ కనిపించిన కానిస్టేబుల్ కి పాదాభివందనం చేసి పోలీసులు, వైద్యుల సేవలను ఆయన కొనియాడారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ గృహాల్లో నే ఉండాలని ఆయన సూచించారు. అత్యవసర సమయాల్లో మినహా గృహాల నుండి ఏ ఒక్కరు బయటకి రాకూడదు అన్నారు . ప్రజలందరూ సహకరిస్తేనే కరోనా వైరస్ నుంచి జయించగల మని ఆయన చెప్పారు. నిత్యావసర సరుకులు, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విత్తులే సమర్థవంతంగా ఎదుర్కోగల మని, ప్రజలందరూ సమన్వయం పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. మైదాన ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చే వారు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
0 Comments