జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు
పాడేరు, ఆగష్టు 30 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పాటు పొడిగిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు శ్రీ హిమాన్షు శుక్ల శుక్రవారం ఆదేశాలు జారీ చేశారని, ప్రస్తుతం ఆగస్టు 31 వరకు అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు, 1 సెప్టెంబర్, 2025 నుండి 30 నవంబర్, 2025 వరకు లేదా నూతన అక్రిడేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు అమలులో ఉంటాయని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారని జిల్లా కలెక్టర్ మరియు డి ఎం ఏ సి చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు..
జిల్లాలో అక్రిడేషన్ సౌకర్యం కలిగి ఉన్న సంబంధిత యాజమాన్యాలు వారి సంస్థ పని చేస్తూ ప్రస్తుతం కొనసాగుతున్న వారి జాబితాను జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేసి పొడిగింపు స్టిక్కర్లు పొందగలరని కోరడమైనది.
0 Comments