నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి.


వి మాడుగుల సెప్టెంబర్ 3 (పడాల శ్రీనివాసరావు ) అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం మాడుగుల పంచాయితీ రామచంద్రపురం గ్రామం లో ఆదివారం విద్యుత్ చార్జీలు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా సి.పి.యం. పార్టీ మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయిందన్నారు. గద్దెకిక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు బడా పెట్టుబడుదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై పన్నులు భారాన్ని మోపుతున్నదని ఆరోపించారు. పేద మధ్యతరగతి ప్రజానీకం ధరల కోరల్లో చిక్కిపోతున్నారని పెట్రోల్ డీజిల కాయగూరల ధరలు ఊహించనంతగా ఈ నెలలోనే 37% పెరిగాయన్నారు. గతంలో కేజీ ఉల్లిపాయలు 100 రూపాయలు ఉండగా నేడు కేజీ టమాటా 200 వరకు పెరిగి కొంత తగ్గిందన్నారు పండించిన రైతుకు మాత్రం ధర రాక టమాటాలను రోడ్లపై పారబోశారని తెలిపారు నిత్యవసర వస్తువుల ధరలు కరెంటు చార్జీలు విపరీతంగా పెరగడంతో పేద మధ్య తరగతి ప్రజలు విలవిలలాడుతూ ఉన్నారన్నారు యువతకు ఉద్యోగం ఉపాధి కరువై నిరుద్యోగులుగా రోడ్లపై తిరుగుతున్నారని డిగ్రీలు పి జి లు చదివిన వారు కూలి పనులకు వెళుతున్నారన్నారు ఎన్నికల సందర్భంగా దేవుని దయ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తానని విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారని ఆయన ఇచ్చిన హామీని గాలికి వదిలేసి 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు ఇప్పుడు నెలవారి పెంపుదలకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారని అన్నారు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎప్పటికప్పుడు విద్యుత్ సాధ్యులను సమర్పిస్తూ ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి చార్జీలను పెంచామని చెప్పింది ఈ సాకుతో ట్రూ ఆఫ్ చార్జీలు సార్ సర్జీలు కస్టమర్ సర్జీలు పిక్సెడ్ చార్జీలు ఎస్టాబ్లిష్మెంట్ చార్జీలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మొదలగు పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై రుద్దారన్నారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు


Post a Comment

0 Comments