చింతపల్లి సెప్టెంబర్ 2 (పడాల శ్రీనివాసరావు.) మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎంపీపీ కోరాబు అనుషా దేవి, జెడ్పిటిసి సభ్యులు పొతురాజు బాలయ్య పడాల్ లు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం దినంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన దినంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాంగి గణబాబు మండల వైస్ ఎంపీపీ శారద మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి చింతపల్లి సర్పంచ్ దురియా పుష్పలత చౌడేపల్లి సర్పంచ్ లలితాదేవి పెద్దబరడ సర్పంచ్ గోపాల్ ఎంపీటీసీలు జయలక్ష్మి దార లక్ష్మి పార్టీ నాయకులు బెన్నీ బాబు రాజారావు మండల కో ఆప్షన్ సభ్యులు నాజర్ వల్లి వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
మీ ప్రాంతం లో అధికారులు, పాలకులు పట్టించుకోని సమస్యలు ఉన్నాయా .. అరుదైన సుందరమైన దృశ్యం కనిపించిందా.. ఇంకెదుకు ఆలస్యం స్మార్ట్ ఫోన్ లో ఫోటో తీసి క్లుప్తంగా సమాచారం రాసి 8500244348వాట్సప్ చేయండి ప్రచురిస్తాం.
0 Comments