వైద్య సిబ్బంది పై చర్యలు తీసుకోవాలి


గూడెం కొత్తవీధి, సెప్టెంబర్ 7 (రామకృష్ణ)

ప్రాణం పోసిన దైవం ఉన్నదో లేదో గాని ప్రాణాలను నిలిపే డాక్టర్ ని మాత్రం ధైవంతో సమానం అంటారు, ఇంకా ఆస్పటల్ లో పనిచేసే నర్సులు, కాంపౌండర్లు గురించి చెప్పాల్సిన పని లేదు. సేవ భావానికి నిలువెత్తు సాక్షులుగా నిలుస్తారు. కానీ మంచిలో చెడు కూడా ఉంటుంది అన్నట్లుగా కొన్ని హాస్పిటల్ లో పని చేసే సిబ్బంది తీరు ప్రాణాలతో చెలగాటం ఆడేలా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ లో ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్లు చేసే చిన్న నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలవుతున్నాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై విమలకుమారి భర్త మెగాసింగ్ అందించిన వివరాలు ఇలావున్నాయిఅల్లూరి జిల్లా జీకేవీధి మండలం దారకొండ పంచాయితీ, ఏనుగుబైలు గ్రామానికి చెందిన జంగం విమలకుమారి అనే గర్భిణీ స్త్రీ ను గతనెల 28 వతేదీన సోమవారం రోజున చింతపల్లి పి హెచ్ సి హాస్పిటల్ నందు డెలివరీ నిమిత్తం జాయిన్ చేయగా మంగళవారం విమలకుమారి కి సుఖ ప్రసవం కోసం వైద్య సిబ్బంది మూడు ఇంజెక్షన్లు ఇవ్వటం జరిగింది. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే మూర్ఛ, బీపీ వచ్చి వేంటనే స్పృహ కోల్పోవడం జరిగింది. ఆమె స్పృహ కోల్పోయిన వేంటనే వాళ్ల భర్త అయిన మెగాసింగ్ అక్కడ వున్న మెడికల్ సిబ్బందిని ఏమి ఇంజెక్షన్ ఇచ్చారు అని అడుగగా సిబ్బంది నుండి ఎలాంటి సమాధానం లేదు. వెంటనే ఆమెను చింతపల్లి నుండి నర్సీపట్నం తరలించడం జరిగింది. అక్కడ వైద్యులు పేషెంట్ కు సీరియస్ గా వుంది వేంటనే వైజాగ్ తరలించాలని వైజాగ్ కేజీహెచ్ కి తరలించడం జరిగింది. కేజీహెచ్ లో వైద్యులు వేంటనే స్పందించి ట్రీట్ మెంట్ ప్రారంభించారు. ట్రీట్ మెంట్ ప్రారంభించి ఆపరేషన్ చేస్తుండగా తల్లి హార్ట్ ఆగిపోయి కడుపులో బిడ్డ మరణించటం జరిగింది. అక్కడ సిబ్బంది ఎందుకు ఆలస్యం చేశారు అని పేసెంట్ తాలూకా వాళ్ళను అడుగగా, చింతపల్లి హాస్పిటల్ లో మెడికల్ సిబ్బంది చేసిన నిర్లక్ష్యం కారణంగా త్వరగా తీసుకు రాలేక పోయాం అని భర్త మెగాసింగ్ తెలియచేశారు. చింతపల్లి లో వైద్యులు, మరియు అక్కడ సిబ్బంది చేసిన నిర్లక్ష్యం కారణంగా "తల్లి,బిడ్డ" మరణించటం జరిగిందని అంటూ వారి కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది వెంటనే స్పందించి ఉంటే ప్రాణాలు పోయి ఉండేవి కాదని చెబుతున్నారు. కావున అధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని మరలా ఇలాంటి చావుకు మరొకరు బలి కాకూడదు అని విమలకుమారి భర్త మెగాసింగ్ హెచ్చరించారు.




Post a Comment

0 Comments