చింతపల్లి. సెప్టెంబర్ 7 (పడాల శ్రీనివాసరావు) కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా చింతపల్లి మండలం కేంద్రం లో అల్లూరిజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంతల సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అలాగే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ దేశంలోనూ విజయ కేతనం ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అరుకు వేలి సమన్వయ కర్త నోగిలి చంద్రకళ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద, బడుగు,బలహీన వర్గాలకు ఎంతో మేలు చేకూరు తుందన్నారు. జిల్లా అధ్యక్షులు సుబ్బారావు నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని రానున్న ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ ఇప్పటినుండే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా ఇంచార్జి మీసాల సుబ్బన్న ,కంకిపాటి వీరన్న పడాల్ అరుకు వేలి నియోజకవర్గ సమన్మయకర్తలు నోగిలి చంద్రకళ,బురిడీ డేవిడ్, పిసిసి డెలిగేట్ సోమేలి సన్యాసిరావు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చీకటి కొండబాబు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పాంగి శాంతిరావు ,జిల్లా ఉపాధ్యక్షుడు జి.కొటేశ్వరరావు, అసెంబ్లీ ఉపాధ్యక్షులు తంగులా అఖిల్ డుంబ్రిగుడా అధ్యక్షులు కొర్ర పరశురాం ,మహిళ అధ్యక్షులు ఉల్లి నీలవేణి, దనసాని శాంతి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాని అప్పరావు నోగిలి సుబ్బారావు బూత్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ ప్రాంతం లో అధికారులు, పాలకులు పట్టించుకోని సమస్యలు ఉన్నాయా .. అరుదైన సుందరమైన దృశ్యం కనిపించిందా.. ఇంకెదుకు ఆలస్యం స్మార్ట్ ఫోన్ లో ఫోటో తీసి క్లుప్తంగా సమాచారం రాసి 8500244348వాట్సప్ చేయండి ప్రచురిస్తాం.
0 Comments