నూతన పింఛన్లు పంపిణీ


గూడెం కొత్తవీధి మండలం (రిపోర్టర్ రామకృష్ణ) సెప్టెంబర్ 2
వయోభారం, ఒంటరితనం, ఆదరణకు నోచుకోని వారిని జగన్ ప్రభుత్వం చేరదీస్తోందని దారకొండ సర్పంచ్ నడిగట్ల రాజు అన్నారు.. నెలనెలా వైఎస్సార్ పెన్షన్ల రూపంలో వారికి ఆర్ధిక సహాయం అందజేస్తూ బాసటగా నిలుస్తోందన్నారు. క్యూ లైన్లలో నిలబడి పింఛన్ తీసుకునే పరిస్థితులు రాకుండా ఇంటింటికీ వాలంటీర్లు వెళ్లి నగదు అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
అనంతరం ఆయన చేతులుమీదుగా సచివాలయం 1 2 లో నూతనంగా మంజూరు అయిన 20 పెన్షన్ లను ఆయన పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో స్ధానిక సచివాలయం సిబ్బంది, వాలంటరీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments