గూడెంకొత్తవీధి సెప్టెంబర్ 1 (పడాల శ్రీనివాసరావు) మన్యం ప్రాంతంలోని మారుమూల పివిటిజి గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ జిల్లా టి ఎన్ ఎస్ ఎఫ్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి ప్రభుత్వాన్ని కోరారు . ఈ మేరకు పివిటిజి గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలన్నారు. జీకేవీధి మండలంలో కుండాలాయగొంది, వీరవరం చేరకంపాలెం,పెద్దపాడు, చుక్కగొయ్యి, చినగొంది ,బోనంగిపల్లి, దారల బయలు, నిమ్మపాడు,కోతి గొంది, ఆకులూరు ఎర్రగెడ్డ, గ్రామాలున్నాయన్నారు. అలాగే కొయ్యురు మండలంలో జర్రి గొంది,నీలవరం, తీగల మెట్ట నల్లబిల్లి, గొడ్డుమామిడి పోకలపాలెం రాజులపాడు, తదితర పివిటిజి గ్రామాలు అభివృద్ధి కి నోచుకోలేదన్నారు. అలాగే కొన్ని గ్రామాలు విద్యుత్, రహదారి కి కూడా నోచుకోలేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి పివిటిజి ల అభివృద్ధి కి తోడ్పాటు నందించాలని మాజీ జిల్లా టి ఎన్ ఎస్ ఎఫ్ కార్యదర్శి ముక్కలి కళ్యాణి కోరారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు గుంటా బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు
0 Comments