ఆగస్టు 30 ( చీఫ్ ఎడిటర్ ) 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన పార్టీ నేత రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగ్గంపేట మండలం ఇర్రిపాకలో సీఎం జగన్ ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైయస్ఆర్సీపీ యువజన నేత జక్కంపూడి గణేష్ పాల్గొన్నారు.
0 Comments