నర్సీపట్నం ఉద్యాన సహాయ సంచాలకులు(ఎడిహెచ్) గా ప్రభాకర్ రావు

నర్సీపట్నం(విఎస్ జెఆనంద్): 
నర్సీపట్నం ఉద్యాన సహాయ సంచాలకులు గా ప్రభాకరరావు బాధ్యతలు స్వీకరించారు. నర్సీపట్నంలో రెండున్నరేళ్లుగా ఎడిహెచ్ గా పనిచేసిన అనురాధ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన విషయం పాఠకులకు తెలిసిందే. తాజా బదిలీల్లో నర్సీపట్నం ఏడిహెచ్ గా ప్రభాకర్ రావు నియమితులయ్యారు. ప్రభాకరరావు పాడేరు ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ ఉద్యాన శాఖ అధికారి గా ఐదేళ్ల పాటు సేవలు అందించారు. ఐటీడీఏ పరిధిలో గిరిజనుల అభివృద్ధికి ప్రభాకర్ రావు ప్రత్యేక కృషి చేసి ఆదివాసీలు, అధికారుల మన్ననలను పొందారు. గిరిజనుల వ్యవసాయ ప్రగతికి ఆయన ఎంతగానో దోహదపడ్డారు. తాజా బదిలీల్లో నర్సీపట్నం ఏడిహెచ్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకరరావు "అన్వేషణ అప్ డేట్" తో మాట్లాడుతూ గిరిజన, మైదాన ప్రాంత రైతుల వ్యవసాయ ప్రగతికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు బిందు, సాయి ప్రియ, సుదర్శన పాల్గొన్నారు.        

Post a Comment

0 Comments