చింతపల్లి(ఆనంద్):
చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం డిప్యూటీ సివిల్ సర్జన్(సూపరింటెండెంట్) డాక్టర్ డి. మహేశ్వరరావు జిల్లా స్థాయి ఉత్తమ వైద్యులు గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ మల్లికార్జున్ చేతులమీదుగా ఉత్తమ వైద్యులు అవార్డుని మహేశ్వరరావు అందుకోనున్నారు. వివరాల్లోకి వెళితే, చింతపల్లి మండలం లబ్బంగి గ్రామానికి చెందిన డాక్టర్ డి. మహేశ్వరరావు వైద్యాధికారిగా, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ గా గిరిజన ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పని చేశారు. మహేశ్వర రావు కూడా గిరిజనుడు కావడంతో విధుల పట్ల అంకితభావంతో పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మూడున్నరేళ్ల గా చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డిసిహెచ్(సూపరింటెండెంట్) గా సేవలందిస్తున్నారు. కేవలం ఇద్దరు వైద్యులు ఉన్న కాలంలోనూ, సిబ్బంది కొరత ప్రభావం రోగులపై పడకుండా మెరుగైన సేవలు అందించి ప్రాంతీయ గిరిజనుల మన్ననలు అందుకున్నారు. స్థానికంగా నివాసం ఉంటూ రోగులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో దిగువ స్థాయి సిబ్బంది, వైద్యులను సమన్వయం చేసుకుంటూ ఆదివాసి రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. డిసిహెచ్ సేవలను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం జిల్లా స్థాయి ఉత్తమ వైద్యులు అవార్డు కి మహేశ్వరరావు ని ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేశ్వర రావు మాట్లాడుతూ, సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, వైద్యుల సహకారంతోనే మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని, ఉత్తమ వైద్యులు అవార్డు లభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
0 Comments