చింతపల్లి( ఆనంద్):
చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు రొట్టెలను సినీ హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ పంపిణీ చేశారు. సోమవారం ఉదయం మహేష్ బాబు ఫ్యాన్స్ చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, రొట్టెలు అందజేశారు. అనంతరం ఐటీడీఏ షటిల్ కోర్టు వద్ద కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు రీమల అనిల్ మాట్లాడుతూ హీరో మహేష్ బాబు సినిమాల్లో ప్రజలకు ఉపయోగపడే మెసేజ్ వుంటుందన్నారు. ఆయన ప్రజలకు పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారన్నారు. ఈ మేరకు మహేష్ బాబు ఫ్యాన్స్ గా మా వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ భాగీ, తరుణ్ , సాయి, నాగార్జున, రవికుమార్, దుర్గాప్రసాద్ , కిరణ్ తేజ, డేవిడ్, పండు పాల్గొన్నారు.
0 Comments