పాత్రికేయుల సేవలు అభినందనీయం :మాజి మంత్రి, వైసిపి నాయకుడు పసుపులేటి బాలరాజు


చింతపల్లి ఏప్రిల్13 (షేక్ కాసిమ్  వలీ) :  ప్రతినిత్యం ప్రజా సంక్షేమం కోరుతూ పనిచేసే పాత్రికేయుల సేవలు అభినందనీయమని  మాజి మంత్రి వైసిపి  నాయకుడు పసుపులేటి బాలరాజు ఆన్నారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో  పాత్రికేయులకు ఆయన శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త లాక్ డౌన్ లోనూ పాత్రికేయులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న  తరుణంలోనూ వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, రెవెన్యూ, మండల పరిషత్ , పంచాయతీ శాఖలతో పాటు పాత్రికేయులు తమవంతు పాత్ర పోషింస్తూ  ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుండడం ప్రశంసనీయమన్నారు.  పాత్రికేయుల సేవలను  ప్రతిఒక్కరు గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments