విశాఖపట్నం తుంగ్లాంలో గిరిజన ప్రైవేట్ ఉదోగులు, దినసరి కూలీలకు నిత్యవసర సరుకులు పంపిణీ



విశాఖపట్నం(అన్వేషణ):
లాక్ డౌన్ లో చిక్కుకున్న గిరిజన ప్రైవేట్ ఉద్యోగులు, దినసరి కూలీలకు ఉజ్వల సొసైటీ, కల్పవల్లి ట్రస్ట్ నిత్యవసర సరుకులను పంపిణీ చేసి వారి ఆకలితీర్చారు. వివరాల్లోకి వెళితే.. పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాలకు చెందిన గిరిజనులు విశాఖపట్నం తుంగ్లాం లో వుంటూ ప్రైవేట్ కంపెనీల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా, దినసరి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా పనులులేక, నిత్యావసర సరుకులు కొనుగోలుచేసుకోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న

 ఉజ్వల సొసైటీ అధ్యక్షులు బాకా లవకుశ , కల్పవల్లి ట్రస్ట్ అధ్యక్షులు రాజేంద్ర కుమార్లు తుంగ్లాం లో నివాసం ఉంటున్న 50 కుటుంబాలకు  6 కిలోల బియ్యం, కాయగూరలు, పప్పు, ఆయిల్ చొప్పున పంపిణీచేశారు. ఈ కార్యక్రమం లో గొందిపకాలు ప్రధానోపాధ్యాయులు  శెట్టి సూరిబాబు  పాల్గొన్నారు
.

Post a Comment

0 Comments