గూడెంకొత్తవీధి(విఎస్ జె ఆనంద్): మండలం పరిధిలో ఖాళీగానున్న 5 గ్రామ వలంటీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో ఎస్. సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మండలం పరిధిలో 5 గ్రామ వలంటీర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయన్నారు. 5 పోస్టులు దేవరపల్లి(రామగెడ్డ), రింతాడ(పనసలొద్ది)(కోరాపల్లి),దామనాపల్లి (సిగినాపల్లి),జర్రెల(అసాంపల్లి) ఖాళీలకు స్థానిక గ్రామ పంచాయతీకి చెందిన అర్హులైన గిరిజన మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీన వెబ్ సైట్ ఓపెన్ అవుతుందని, 24 తో దరఖాస్తు గడువు ముగుస్తుంది అన్నారు. గ్రామ వలంటీర్ పోస్ట్ కి దరఖాస్తు చేసుకునేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులై 2020 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలు లోపు ఉండాలన్నారు . దరఖాస్తుతోపాటు స్థానికత నిర్ధారణ కోసం రేషన్ కార్డు గాని, ఆధార్ కార్డు గాని, నివాస ధ్రువీకరణ పత్రంగాని సమర్పించాలన్నారు . కులధ్రువీకరణ పత్రం తప్పని సరిగా జత పరచాలన్నారు. గ్రామ వలంటీర్ల దరఖాస్తులను 25న పరిశీలించి, 27 నుంచి 29 వరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కేవలం అర్హతలు ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు విధుల్లో చేరుటకు మే 1న ఎంపిక పత్రం ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.
0 Comments