పట్టణ పరిసర ప్రాంతాల్లో టోకెన్ సిస్టం ద్వారా చిరు వ్యాపారులకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని చింతపల్లి ఏ ఎస్ పి సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చింతపల్లి, పరిసర ప్రాంతాలలో చాలా మంది నిరుపేద కుటుంబాలు వారి యొక్క దినసరి కూలీ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, మానవతా దృక్పదం తో సిమెంట్ షాపులు, బార్బర్ షాపులకు టోకెన్ సిస్టం ద్వారా అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే టీ & టిఫిన్ షాపుల్లో పార్సిల్ సిస్టమ్ ద్వారా అనుమతి అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విధానంపై చిరు వ్యాపారులకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలు అందరూ సహకరించాలని ఆయన తెలిపారు.
0 Comments