పట్టణ కేంద్రాల్లో అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ సాదాసీదాగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకున్నారు.


మంగళవారం ఉదయం అరకు పార్లమెంట్ జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, జడ్పిటిసి అభ్యర్థి పోతురాజు బాలయ్య, గంగన్న పడాల్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్, గిరిజన ఉద్యోగుల సంఘం, జేఏసీ నాయకులు దేపూరి శశి కుమార్, లోచలి రామకృష్ణ , యు వి గిరి, కుడుముల వెంకటరమణ, జీసీసి సంఘం నాయకుడు చల్లంగి కృష్ణారావు, లంబసింగి ప్రధానోపాధ్యాయులు పాఠశాల పనసల ప్రసాద్, పంచాయతీరాజ్ జె ఈ కిముడు జ్యోతి బాబు, చింతపల్లి ఎంపీడీవో ప్రేమకర రావు, ఈవో ఆర్ డి శ్రీనివాస రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.



0 Comments