ఏపీలో 161 చేరిన కరోనా పాజిటివ్ కేసులు..విజయవాడలో తొలి కరోనా మరణం సంభవించిం

అమరావతి ఏప్రిల్ 3( మధ్యాహ్నం): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 161కి చేరుకుంది. ఈరోజు  నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి.
కరోనా పాజిటివ్‌ కేసులు:- 
నెల్లూరు-32
కృష్ణా-23
గుంటూరు-20
కడప-19
ప్రకాశం-17
పశ్చిమ గోదావరి-15
విశాఖపట్నం-14
తూర్పుగోదావరి-09
చిత్తూరు-09
అనంతపురం-02
కర్నూలు - 01 పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. గురువారం  వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవ్వగా.. తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి.విజయవాడ లో ఒకరు మృతి 
ఏపీలోని విజయవాడలో తొలి కరోనా మరణం సంభవించింది. విజయవాడలో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా ఆ వ్యక్తికి కరోనా సోకింది. వెంటనే తండ్రి, కుమారుడితో కాంటాక్ట్ అయిన 29 మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అయితే.. రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించడంతో  ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Post a Comment

0 Comments