పాడేరు మార్చి26. గిరిజన గ్రామాల్లోకి ప్రవేశించకుండా గ్రామస్థులు రోడ్డుకు అడ్డంగా రాళ్లు, కంచె వేసిన చెక్ పోస్ట్ లు తొలగించాలని ఐటిడిఎ పి.ఓ డి.కె.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలియ చేసారు. గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం వలన అంబులెన్స్ ల ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు, వాహనాలు గ్రామాలకు తీసుకొని వెళ్లేందుకు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు
ఏజెన్సీ నలుమూలల చెక్ పోస్టులు ఏర్పాట్లు చేసామన్నారు. అవి 24 గంటలు కొనసాగుతున్నాయని చెప్పారు. గ్రామాల్లోచెక్ పోస్ట్ లకంటే స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించడాని వైద్యం అందించడానికి సహకారాన్ని అందించాలని కోరారు.
0 Comments