లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు...చింతపల్లి పోలీసులు..

చింతపల్లి (షేక్ కాశిమ్ వలీ): లాక్ డౌన్ నిబంధనలు అధికారమిస్తే చర్యలు తప్పవని చింతపల్లి పోలీసులు హెచ్చరించారు.  కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం విధితమే. 144 సెక్షన్ అమలులో ఉండటం వల్ల ప్రజలందరూ గృహాల కే పరిమితమయ్యారు. అయితే నిత్య అవసరాల కోసం కుటుంబం నుంచి ఒకరు రెండు రోజులకు ఒకసారి నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు బయటకు వచ్చే అవకాశం కల్పించారు. దీంతో మినహాయింపు కల్పించిన సమయాల్లో నిత్యావసర దుకాణాలు కిరాణా దుకాణాలు తెరుచుకున్నాయి.  చింతపల్లి పట్టణంలో లాక్ డౌన్ అమలు తీరును పోలీసులు ఎప్పటికప్పుడు డ్రోన్ సహాయంతో పరిశీలిస్తున్నారు. దుకాణాల వద్ద నిబంధనలు పాటించని యజమానులను డ్రోన్ సహాయంతో పరిశీలించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అనవసరంగా బయట తిరిగే వ్యక్తులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టారు .     చింతపల్లి లో డ్రోన్ ను ప్రదర్శించి పరిస్థితి పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో స్థానిక ఏయస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ సన్యాసి నాయుడు, యస్ఐ షరీఫ్ మహమ్మద్ ఆలీ లు గ్రామంలో ద్విచక్ర వాహనాలపై నిబంధనలను అతిక్రమించి  ప్రయాణం చేసే వాహనదారులను నియంత్రించారు.

Post a Comment

0 Comments